28 June, 2026 | 2:10 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

మామను చంపిన అల్లుడు

13-12-2025 12:00 AM
  1. కూతురిని కొడుతున్నాడని అడ్డుకున్న తండ్రి
  2. కోపంతో కత్తితో దాడి
  3. బీరంగూడలో దారుణ ఘటన

అమీన్‌పూర్, డిసెంబర్ 12(విజయక్రాంతి): మద్యానికి బానిసై మామను అల్లు డు హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలో గురువారం రాత్రి జరిగింది. బీరంగూడలో నివాసం ఉంటున్న చిత్తారి చంద్రయ్య(57) కూతురులకి రామకృష్ణ అనే వ్యక్తితో 2005లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రామకృష్ణ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడు. గత మూడు నెల ల క్రితం గొడవ జరగడంతో లక్ష్మీ తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటుంది.

ఈనెల 11న రాత్రి మద్యం సేవించిన రామకృష్ణ అత్తగారింటికి వెళ్లి భార్యతో గొడవ పడ్డాడు. కూతురును కొడుతున్నాడని అల్లుడిని చంద్రయ్య బయటకు గెంటివేశాడు. తీవ్రకోపంతో రగిలిపోయిన రామకృష్ణ నీ అంతు చూస్తానంటూ బయటకు వెళ్లి అరగంట తర్వాత కూరగాయలు కోసే కత్తితో చంద్రయ్యపై విచక్షణా రహితంగా పొడిచాడు. గాయపడ్డ చంద్రయ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ నరేశ్ తెలిపారు. మృతుని కూతురు కడమంచి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.