యూరియా యాప్ను రద్దు చేయాలి
ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి),జూన్ 30: అ న్నదాతలను అయోమయానికి గురి చేసే యూరియా యాప్ను వెంటనే రద్దుచేసి, నకి లీ విత్తనాలు,పురుగుమందులను అరికట్టాలని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శం కర్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేం ద్రం అర్వపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం లో ఆ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ యూరియా యాప్ ను రద్దు చేయాలని,అన్ని రకాల సన్నాలకు బోనస్ ప్రకటించాలని, వానాకాలం సీజన్లో రైతులకు బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు చే యాలని కోరారు. ఎరువులు,విత్తనాలపై బ హుళ జాతి కంపెనీల ఆధిపత్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ధర్మాజీ,రంజిత్, జక్కి మల్లయ్య, శేఖర్, శ్రీను తదితరులు ఉన్నారు.






