2 July, 2026 | 2:23 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

జీవ ఇంధనాల వాడకాన్ని మెరుగుపరచాలి

12-08-2025 12:00 AM

శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి జీవ ఇంధనాల వాడకాన్ని పెంపొందించేందుకు రైతులు ఆసక్తి చూపాల్సిన అవసరముంది. జీవ ఇంధనాలు పునరుత్పాదక శక్తి వనరులు, శిలాజ ఇంధనాలతో పోలిస్తే పర్యవరణానికి అనుకూలమైనవి. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువగా వస్తాయి. ఇవి స్థిరమైన ఇంధన వనరులుగా పిలువబడుతాయి.

పేద దేశాలు సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించేందుకై లభ్యమవుతున్న స్వచ్ఛ శిలాజ ఇంధనాలను సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశమివ్వాలి. అందుకోసం ప్రపంచంలో వివిధ దేశాలు ఆవలంబిస్తున్న విధానాలను పరిశీలించాల్సిన అవసరముంది.  అప్పుడే ఆహార పంటలతో పోటీపడే తత్వం అందరికి చేరువవుతోంది. ఇందుకు దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతను అందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. 

రైతులకు రాయితీలు అందించి విధి విధానాలతో మార్పులు చేసి ప్రోత్సాహకాలు అందిస్తే రైతులు శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి జీవ ఇంధనాల వాడకంపై ఆసక్తి చూపిస్తారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని రైతులంతా జీవ ఇంధనాలు వాడేలా ప్రోత్సాహకాలు అందించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా.

 సత్యనారాయణ, అల్లాదుర్గం, మెదక్ జిల్లా