13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖి చేసిన సర్పంచ్

03-01-2026 12:00 AM

పాఠశాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తా

గరిడేపల్లి, జనవరి 2,(విజయ క్రాంతి): మండలంలోని పొనుగోడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల,అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును గ్రామ సర్పంచ్ కటికం వేణు శుక్రవారం ఆకస్మికంగా తనకి చేశారు.పాఠశాలలోకి వెళ్లి వంటశాలలు,భోజనం నాణ్యత పరిశుభ్రత మెనూ పరిస్థితులను ఆయన పరిశీలించారు.

విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనాన్ని దగ్గరుండి పరిశీలించిన ఆయన ఆహార పదార్థాలు నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన మాట్లాడుతూ వంటశాలను సామాగ్రిని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని  ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ హాజరుకావాలని తరగతులు క్రమబద్ధంగా నిర్వహించాలని అన్నారు.

ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలు అవ్వాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.విద్యార్థులతో మాట్లాడి భోజనం పై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని సూచించారు.భవిష్యత్తులో నిరంతరం పాఠశాల పనితీరుపై పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు నేలపట్ల వెంకటేశ్వర్లు చామకూరి గురుస్వామి కోడి మల్లయ్య చామకూరి సుధాకర్ అంజి పోలంపల్లి సైదులు మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది పాల్గొన్నారు