21-06-2025 07:40:01 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కోటగల్లి కోట దుర్గమ్మ దుర్గామాత ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో 22 గ్రాముల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు. రోల్డ్ గోల్డ్, వెండి ఆభరణాలు విడిచిపెట్టి బంగారం ఆభరణాలు మాత్రమే ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘనటా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.