7 May, 2026 | 2:08 PM

Breaking News

కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •  

పాలకులు మారిన ఆదివాసీల బతుకుల్లో మార్పు లేదు..

09-08-2025 10:53 PM

ఎమ్మెల్యే పాయల్ శంకర్..

అదిలాబాద్ (విజయక్రాంతి): స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆదివాసి సమస్యలు అలాగే ఉన్నాయని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) అన్నారు. మానవ జాతికి మూల కారణం ఆదివాసులేనని అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని రెవెన్యూ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదివాసి సమాజానికి ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాలకులు ఎందరు మారినా ఆదివాసీల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి,  తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ తో పాటు పలువురు ఆదివాసీ సంఘాల నేతలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.