1 July, 2026 | 8:11 PM

Breaking News

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •  

పాలకులు మారిన ఆదివాసీల బతుకుల్లో మార్పు లేదు..

09-08-2025 10:53 PM

ఎమ్మెల్యే పాయల్ శంకర్..

అదిలాబాద్ (విజయక్రాంతి): స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆదివాసి సమస్యలు అలాగే ఉన్నాయని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) అన్నారు. మానవ జాతికి మూల కారణం ఆదివాసులేనని అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని రెవెన్యూ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదివాసి సమాజానికి ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాలకులు ఎందరు మారినా ఆదివాసీల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి,  తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ తో పాటు పలువురు ఆదివాసీ సంఘాల నేతలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.