18 April, 2026 | 11:19 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం

01-05-2025 01:55 AM
  1. కులగణనతో సామాజిక న్యాయం

మంత్రి కొండా సురేఖ

హైదారాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): సామాజిక దృక్పథం కలిగిన తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడితోనే కేంద్ర క్యాబినెట్ కులగణనకు అంగీకరించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అద్భుత విజయమన్నారు.

కులగణన రాహుల్ గాంధీ ఆశయ మని, ప్రభుత్వ పెద్దల కృషి అని తెలిపారు. కేంద్ర నిర్ణయం సంతోషకరమని, భారత్ జోడో యాత్రలో సామాజిక అసమానతలు, కుల రుగ్మతలు తొలగించడానికి దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు. తెలంగాణలో చేపట్టిన కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసినట్టు వెల్లడించారు.