15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వాణిజ్యం నిలిపేస్తానని బెదిరించా..

13-05-2025 12:58 AM
  1. అందుకే భారత్-పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి
  2. రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగి ఉంటే ఎంతో నష్టం జరిగేది
  3. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

న్యూఢిల్లీ, మే 12: భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని రెండు రోజుల క్రితం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మరోసారి కీలకవ్యాఖ్యలు చేశా రు. భారత్-పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే వాణిజ్యం నిలిపేస్తానని.. హెచ్చరిం చానని.. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తెలిపారు.

వాణిజ్యం అనే అస్త్రాన్ని తాను వాడిన ట్టు మరెవరూ వాడలేదన్నారు. ‘భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందా నికి మా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించింది. తద్వారా రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రమాదకర ఘర్షణకు తెరపడింది. ఈ రెండు దేశాల నాయకత్వం ధృఢంగా, శక్తివంతంగా ఉంది. వారు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు.

ఉద్రిక్తతలకు ముగింపు పలికి తేనే వాణిజ్యంలో మీతో ముందుడు గు వేస్తాం. లేకపోతే ఎలాంటి వాణి జ్యం చేయబోమని హెచ్చరించా. ఇన్ని రోజులు వాణిజ్యం విషయంలో అం డగా ఉన్నాం. భవిష్యత్‌లో భారత్ వాణిజ్య సంబంధాలు బలో పేతం చేసుకోనున్నాం. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు నా టీం బాగా పనిచేసింది’  అని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ రెండు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృ షి చేస్తానని ట్రంప్ వెల్లడించిన విష యం తెలిసిందే. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నపుడు కూడా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నాలు చేశారు. వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పంధాన్ని అంగీకరించాయన్న ట్రంప్ వాదనను భారత వర్గాలు ఖండించాయి.