10-12-2025 08:21:58 AM
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad district) బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. జిల్లాలోని జైనథ్ మండలం తరోడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను ఆదిలాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తలించారు.