13 June, 2026 | 9:33 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •   వేశ్య కాంతల చెరువు.. తామరచెరువు బేతుపల్లి చెరువులను సర్వే చేయాలి   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

కనులపండువగా తిరుమల బ్రహ్మోత్సవాలు

01-10-2025 12:00 AM
  1. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై ఊరేగిన స్వామివారు
  2. పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
  3. గోవింద నామస్మరణతో మార్మోగిన పరిసరాలు

తిరుమల, సెప్టెంబర్ 30: తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్స వాలను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి స్వామి వారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూ షణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం.

చంద్రప్రభ వాహనంపై తిరుమలేశుని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగింది. గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగింది. వాహన సేవకు ముందు కళాబృందాల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నా యుడు, ఈవో అనిల్‌కుమార సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు వాహన సేవలొ పాల్గొన్నారు.

ఉదయం శ్రీవారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహ నంపై భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమలేశుని వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించారు.