6 May, 2026 | 9:02 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

అవినీతి నిరోధక శాఖ అధికారులమంటూ టోకరా

26-05-2025 12:19 AM
  1. తహసీల్దార్ ను బెదిరించి రూ.98 వేలు కాజేసిన వైనం

టేకులపల్లి మండలంలో ఘటన 

రూ.2 లక్షల ఇవ్వాలంటూ డిమాండ్ 

లేకుంటే కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపు 

టేకులపల్లి, మే 25 (విజయక్రాంతి): తాను అవినీతి నిరోధకశాఖ అధికారినని, లంచం కేసులో ఇరికిస్తానని బెదిరించడంతో టేకుల పల్లి తహసీల్దార్ గుర్తుతెలియని వ్యక్తికి రూ.98 వేల డబ్బు ముట్ట జెప్పాడు. టే కులపల్లి తహసీల్దార్ ముత్తయ్యకు శనివారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి పోన్కాల్ వచ్చింది. తాను అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ అతడు పలకరించాడు.

మీ కార్యాలయ ఆర్ ఐ కొ ద్ది సేపటి క్రితం లంచం తీసుకుంటూ మాకు పట్టుబడ్డాడని, ప్రస్తుతం మా అదుపులో ఉన్నాడు. రూ.2 లక్షలిస్తే నిన్ను కేసులో ఇరికించకుండా వది లేస్తా అని బెదిరించాడు. ఈనెలాఖరుతో ఈ తహసీల్దార్ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సమయంలో కేసులు, ఇతర చిక్కులెందుకని ఆయన భయపడ్డారు. మంజుగౌరి అనే వివరాలతో ఉన్న 74832 47988 నంబరుకు నాలుగు దఫా లుగా రూ.98 వేలు పంపించారు.

కాసేపటికి తేరు కుని తన గిర్దావరు ఫోన్చేశారు. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్చేసి కాల్ కాన్ఫరెన్స్లో మీతో మాట్లాడించారు. ఏసిబీ దాడి గురించి నాకేం తెలీదు అని ఆయన సమాధానమిచ్చాడు. మోసగాడు చాకచ క్యంగా ఇద్దరినీ బురిడీ కొట్టించాడని తహసీల్దార్ గ్రహించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదిచ్చారు. పదవీ విరమణ సమయంలో ఇబ్బందులెందుకనే ఉద్దేశంతో మోసగాడు చెప్పి నట్టు డబ్బు పంపించానని ఫిర్యాదులో తెలిపారు. విచారణ కొనసాగుతుంది.