15 June, 2026 | 3:14 PM

Breaking News

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •  

కవిత వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

13-01-2026 03:06 PM

హైదరాబాద్: నీటి వాటాల విషయంలో రాజీపడేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Goud) మంగళవారం నిర్వహించిన చిట్ చాట్ లో స్పష్టం చేశారు. సినీ రంగంలో తమకు అందరూ సమానమేనని పేర్కొన్నారు. జిల్లాలను తొలగించాలనే ఆలోచన తమకు లేదన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీలోచేరుతున్నారనే ప్రచారం అవాస్తమని మహేష్ గౌడ్ వివరించారు. కవిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో భారీ అవినీతి జరిగిందని కవిత చెప్తున్నారని పునరుద్ఘటించారు. కవిత(Kavitha) చేస్తున్న విమర్శలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలు ఆదరించరని సూచించారు. బీఆర్ఎస్ కు గతం తప్ప భవిష్యత్ లేదన్నారు. బీజేపీ నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల పేరుతో రాజకీయంతోనే ఓటుబ్యాంకు పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ విమర్శించారు.