02-05-2025 07:46:36 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పరిశీలకులుగా వచ్చిన పీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ బోజ గౌడును శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. శాలువాతో సత్కరించి మెమొంటాను అందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు నర్సా గౌడ్ కృష్ణమోహన్ గౌడ్ లింగాగౌడ్ రాజేశ్వర్ గౌడ్ రవీందర్ గౌడ్ తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.