calender_icon.png 5 October, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముకుందాపూర్ లో విషాదం..

05-10-2025 07:32:05 PM

ఈతకు వెళ్లి చెరువులో మునిగి యువకుడు మృతి..

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముకుందాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ముద్దయిపేట చెరువులో ఈతకు వెళ్లిన చినావత్ సునీల్ కుమార్(18) అనే యువకుడు చెరువులో ఈ ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి ప్రయత్నించి మధ్యలో నీటి ఉధృతికి తట్టుకోలేక నీట మునిగి మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, స్నేహితుల రోదన మిన్నంటింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.