5 March, 2026 | 5:16 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ తగిలి రైతుమృతి   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

నీటిలో మునుగుతున్న బాలుడిని కాపాడబోయి మహిళ మృతి

05-10-2025 07:58 PM

బాలుడు సేఫ్..

నల్గొండ క్రైం: కాలువ నీటిలో మునుగుతున్న బాలుడిని కాపాడబోయిన మహిళ ఆదివారం మృతి చెందింది. నల్గొండ మండలం కతాల్ గూడ కి చెందిన పగడాల అంజలి(28) ఆమె సోదరి ముగ్గురు పిల్లలు ఇతరులతో కలిసి కొత్తపల్లి గ్రామ శివారులో ఢీ37 కాలువలో బట్టలు ఉతికేసిన అనంతరం ఈత కొడుతుండగా, అదే గ్రామస్థుడు జిల్లేపల్లి దీక్షిత్ అలియాస్ చిన్ను నీటిలో మునిగిపోతుండగా అతనిని రక్షించే క్రమంలో బాలుడు దీక్షిత్ అంజలిని బిగ్గరగా పట్టుకోవడంతో ఇద్దరు నీటిలో మునిగి కొట్టుకుపోతుండగా గమనించిన నారబోయిన రామకృష్ణ దీక్షిత్ నీ రక్షించాడు. అంజలి నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది. మృతురాలు భర్త కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు నల్గొండ రూరల్ ఎస్ఐ సైదా బాబు తెలిపారు.