23-12-2025 09:27:34 AM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా(Sangareddy) కోహిర్ మండలం కవేలి చౌరస్తా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పొగమంచులో దారి కనిపించక బస్సు రోడ్డు కిందకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని 31 మంది ప్రయాణికులకు ప్రాణనష్టం తప్పింది. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులకు ప్రాథమిక చికిత్స అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సహాయక చర్యలు చేపట్టారు.