calender_icon.png 6 June, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన సంస్కృతికి సజీవం గిరిజన మ్యూజియం

28-05-2025 11:24:46 PM

మంత్ర సీతక్క...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతులు అంతరించిపోకుండా సజీవంగా ఉంచేందుకు గిరిజన మ్యూజియం దోహదపడుతుందని స్త్రీ సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ఉన్నారు. బుధవారం రాత్రి భద్రాచలంలో ఏర్పాటు చేసిన గిరిజను మ్యూజియంను ఆమె సందర్శించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రాచుర్యంలోకి  తేవడం అన్నారు.  మ్యూజియంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ చిత్రాలను కళాఖండాలను, పాతకాలపు మట్టి ఇండ్లు, చిన్నారులకు నిర్మాణం చేపట్టిన ఆట స్థలము బోటింగ్ పాయింట్, బాక్స్ క్రికెట్, బీచ్ వాలీబాల్ గ్రౌండ్ పరిశీలించారు. 

అంతకుముందు మ్యూజియంలో బోటు షికారు చేస్తున్న చిన్నారులతో, మ్యూజియం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి నమ్మకానికి విశ్వాసానికి గిరిజనులకు పెట్టింది పేరని, ఎటువంటి కల్తీ లేకుండా సబ్బులు, తినుబండారాలు అమ్మకాలు చేసుకొని ఉపాధి పొందాలని మహిళలకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసి గిరిజనుల జీవన విధానాలు, సాంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వారు పూజించే దేవతామూర్తులు సహజత్వాన్ని ఉట్టిపడేలా ఉన్నాయని, మ్యూజియంలోని పాతకాలపు కళాఖండాలను, గిరిజనులు ఉపయోగించే పనిముట్లను చూస్తే మా చిన్ననాటి స్మృతులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.

చిన్నతనంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ సంస్కృతి సాంప్రదాయాలను విస్మరించలేదని, సాంస్కృతి సాంప్రదాయాలు నేటితరం యువతీ యువకులకు గిరిజన జీవన విధానాలను ఆచార వ్యవహారాలను తెలియజేసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేయడం నిజంగా గిరిజన సంస్కృతి అంతరించిపోకుండా సజీవంగా ఉంటుందని, భవిష్యత్ తరాలకు అటవీ ఫలాలు రుచి చూపించడానికి ఇంతటి మహత్తరమైన మ్యూజియం ఏర్పాటుకు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ,ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, ఐటీడీఏ యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో బాధ్యతగా మ్యూజియమును సర్వ సుందరంగా తయారు చేసినందున వారందరికీ అభినందిస్తున్నట్లు ఆమె తెలిపారు. గిరిజనుల ఆచార వ్యవహారాలు సాంస్కృతి సాంప్రదాయాలకుసంబంధించిన ప్రతి అంశం సీఎం దృష్టికి తీసుకొని పోయి అన్ని ఐటీడీఏలలో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేస్తామని అన్నారు. 

అనంతరం గిరిజన వంటకాలకు సంబంధించిన స్టాల్స్ ను పరిశీలించి నాణ్యతతో కూడిన ఆహార వస్తువులనే మ్యూజియం సందర్శనకు వచ్చే ప్రజలకు అందించాలని అన్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారి  మ్యూజియంలోపల కళాఖండాలను పెయింటింగ్ చిత్రాలను మట్టి ఇళ్లను చూపించి వాటికి సంబంధించిన చరిత్రను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రై కార్ చైర్మన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితా రామచంద్రన్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ,సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ,ఐటీడీఏ యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.