28-05-2025 11:33:35 PM
పాండ్యా కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నా..
బీఆర్ఎస్ మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్..
హైదరాబాద్ (విజయక్రాంతి): నిర్ణయాధికారం ఎన్డీఎస్ఏకు వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్కుమార్(Former BRS MP Vinod Kumar) సూచించారు. మేడిగడ్డ వద్ద నీళ్లు నిల్వ చేయకపోవడంతో నీళ్లు సముద్రం పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమీ కాలేదని, మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయడానికి వేసిన కమిటీ ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభం చేయాలన్నారు. మేడిగడ్డ మూడు పిల్లర్లు రిపేరు చేయాలని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళల్లో నీళ్లు నింపాలన్నారు. కాళేశ్వరం కమిషన్ ఏం అడిగినా చెప్పడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని వినోద్ కుమార్ తెలిపారు. కవిత చేసిన కామెంట్స్పై ఇప్పటికే కేటీఆర్ స్పందించారని అన్నారు.