01-12-2025 06:18:38 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న సన్మానం చేశారు. అంకితభావంతో పని చేసిన ఉపాధ్యాయ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భూమన యాదవ్ లక్ష్మణ్ వహీద్ ఖాన్ వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ తదితరులున్నారు.