1 July, 2026 | 10:06 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

విద్యార్థులకు నిపుణులతో ప్రత్యేక తరగతులు

01-12-2025 06:27 PM

జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రధానమంత్రి శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు పాఠశాలలలో ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ నెల 8వ తేదీ లోగా అన్ని ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలలో నిపుణులతో కెరీర్ గైడెన్స్ పై కౌన్సిలింగ్ అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రూప్ 1 అధికారులు, ఇతర అధికారులు తాము ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన తీరు, పోటీ పరీక్షలకు సన్నద్ధమైన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ దిశగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారు మయంగా మలుచుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, ఎస్.ఓ. దేవాజీ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.