1 April, 2026 | 11:59 AM

Breaking News

దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •   కమర్షియల్ గ్యాస్ ‘మంట’.. భారీగా పెరిగిన సిలిండర్‌ ధర   •  

విద్యార్థులకు నిపుణులతో ప్రత్యేక తరగతులు

01-12-2025 06:27 PM

జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రధానమంత్రి శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు పాఠశాలలలో ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ నెల 8వ తేదీ లోగా అన్ని ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలలో నిపుణులతో కెరీర్ గైడెన్స్ పై కౌన్సిలింగ్ అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రూప్ 1 అధికారులు, ఇతర అధికారులు తాము ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన తీరు, పోటీ పరీక్షలకు సన్నద్ధమైన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ దిశగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారు మయంగా మలుచుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, ఎస్.ఓ. దేవాజీ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.