13 April, 2026 | 12:59 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

టీఎస్ యుటిఎఫ్ జిల్లా సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపు

28-11-2025 07:45 PM

నకిరేకల్,(విజయక్రాంతి): ఈనెల 30న తిప్పర్తి లో జరిగే టీఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా విస్తృత కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కేతపల్లి మండల శాఖ అధ్యక్షులు కాశిమల్ల నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో పోస్టర్ ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల బలోపేతం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశం, ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లు వంటి కార్యక్రమాల్లో టీఎస్ యుటిఎఫ్ ముందుండి పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధి కోసం సంఘం రాజీలేని పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఆదివారం జరిగే జిల్లా విస్తృత కమిటీ సమావేశాలకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయసాగర్, శ్యామయ్య, గోపయ్య, వీరభద్రయ్య, రమేష్, శంకరయ్య, నర్సిరెడ్డి, యాదగిరి, శ్రీలత, యాదమ్మ, అశ్విని తదితరులు పాల్గొన్నారు.