calender_icon.png 23 December, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించాలి

23-12-2025 06:37:15 PM

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

ఘట్ కేసర్,(విజయక్రాంతి): విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించుకొని ముందుకు సాగాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. టిటిఏ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టిటిఏ సేవ డేస్ కార్యక్రమంలో భాగంగా  బైనగారి నరేష్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి పోచారం సర్కిల్ పరిధిలోని కొర్రెములలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డైనింగ్ హల్, మక్త లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే మల్లారెడ్డి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ముందే లక్ష్యాన్ని ఎంచుకొని విద్యతో పాటు క్రీడల పట్ల శ్రద్ధ వహించి రెండిట్లో రాణించాలని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని, చెడు వ్యసనాల పట్ల ఆకర్షితులు కాకూడదని సూచించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమలను విక్షించడం జరిగింది.