2 July, 2026 | 12:06 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ తో మాట్లాడిన తుమ్మల

12-07-2025 09:25 AM

హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు(Sitarama project) నుంచి నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో(Minister Uttam Kumar Reddy) మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. నాగార్జున సాగర్ నీటి విడుదల(Nagarjuna Sagar water release) ఆలస్యం అవుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో నూ మంత్రి తుమ్మల మాట్లాడారు. ఇవాళ సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల విజ్ఞప్తి మేరకు మంత్రి తుమ్మల నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, కలెక్టర్లతో మాట్లాడారు.