08-06-2025 12:38:45 AM
జూన్ 25 నుంచి 29 వరకు పరీక్షలు
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిం ది. జూన్ 25 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, పీహెచ్డీ ప్రవేశాలకు ఉపయోగపడే ఈ పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.
మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. రోజుకు రెండు షిఫ్టు ల్లో, ఉదయం 9 గంటల నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుం చి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పరీక్ష జరుగుతుంది.