01-12-2024 02:27:02 AM
కోఠి మహిళా వర్సిటీ విద్యార్థినుల ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): నగరంలోని కోఠి మహిళా వర్సిటీ విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. శనివారం వర్సిటీలోని ప్రధాన గేటు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కాలేజీ నుం చి వర్సిటీగా మారి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇంతవరకు యూజీసీ గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే అసెంబ్లీలో బిల్లుపెట్టి మహిళా వర్సిటీకి యూజీసీ గుర్తింపు కోసం కేంద్రానికి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు.