17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మున్సిపల్ నిర్వహణ చేయరాదా?

01-01-2026 02:09 AM

- ప్రజావాణిలో 50 ఫిర్యాదులు గజ్వేల్‌వే

- గజ్వేల్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హైమావతి

గజ్వేల్, డిసెంబర్ 31: మున్సిపాలిటీ నిర్వహణ చేయరాదా అంటూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై జిల్లా కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ హైమావతి సందర్శించారు. కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. కాగా మున్సిపల్ కార్యాలయంలో చెత్త చెదారం తో పాటు అపరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచలేని వారు మునిసిపాలిటీని ఎలా శుభ్రంగా ఉంచుతారని ప్రశ్నించారు. ప్రజావాణిలో 63 దరఖాస్తులు ఉంటే అందులో 50 దరఖాస్తులు గజ్వేల్ నుండి వచ్చినవే ఉన్నాయన్నారు.