15 April, 2026 | 4:39 PM

రూ.1౦ లక్షలతో భూగర్భ డ్రైనేజీ

24-10-2025 12:00 AM

పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ రాఘవేంద్ర నగర్‌లో 10 లక్షల రూపాయల వ్యయం తో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ శాంతి తో కలిసి ఏమ్మెల్యే లక్ష్మారెడ్డి డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ డివిజన్ పరిధిలోని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిఆర్‌ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్ మక్తాల శేఖర్ గౌడ్ సంఘం యాదగిరి సురేందర్ గౌడ్ వెంకట్ రెడ్డి విలాస్ రెడ్డి ప్రవీణ్ జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.