14-06-2025 11:17:28 PM
కాంగ్రెస్ సీనియర్ నాయకులు కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్యం పాపిరెడ్డి
కోదాడ: కోదాడ శాసనసభ్యురాలు పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉత్తం పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavathi Reddy)కి మంత్రి పదవితో సమానమైన చీఫ్ విప్పు మహిళా కోట నుండి ఇవ్వాలి, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి కోదాడ నియోజకవర్గ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తం పద్మావతికి చీప్ విపు ఇవ్వాలని శనివారం ముఖ్యమంత్రికి లేఖను పంపారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉంటూ ఉన్నత చదువులు చదివి ఆర్కిటెస్టుగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో మహిళా సీనియర్ నాయకురాలు, నల్గొండ ఖమ్మం జిల్లాలో కలిపి ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉత్తం పద్మావతి రెడ్డికి మంత్రి పదవితో సమానమైన చీఫ్ విప్పును కేటాయించాలని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విజ్ఞప్తి అని పేర్కొన్నారు.