07-07-2025 12:43:33 AM
మహబూబాబాద్ జిల్లాలో ఘటన
మహబూబాబాద్, జూలై 6 (విజయక్రాంతి): విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలు ఆదివారం సాయంత్రం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య 428/11 కిలోమీటర్ వద్ద ఎద్దును ఢీ కొట్టింది. రైల్ ఆగిపోవడంతో స్పందించిన రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని మృతిచెందిన ఎద్దును తొలగించారు.
ఈ ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగంలోని ఫైబర్ షీట్ దెబ్బతిని ఎగిరిపోయింది. రైల్వే పోలీసులు, ఇంజనీరింగ్ అధికారులు అక్కడికి చేరుకుని రైలును పరీక్షించి, పెద్దగా ప్రమాదం ఏది జరగలేదని నిర్ధారించి రైలును తిరిగి పంపించారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్, జీఆర్పి అధికారులు విచారణ చేపట్టారు.