31-01-2026 01:38:16 AM
ప్రస్తుతం సినీప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల్లో ‘వారణాసి’ ఒకటి. మహేశ్బాబు, ఎస్ఎస్ రాజమౌళి కలిసి తొలిసారి చేస్తున్న సినిమా ఇది. శ్రీదుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి వార్త సంచలనం సృష్టిస్తోంది.
దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ను తనదైన రీతిలో చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం వారణాసి నగరం అంతటా ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్లు, బ్యానర్లు ఆకస్మికంగా కనిపించడంతో దేశవ్యాప్తంగా అనేక చర్చలు నడిచాయి. ఈ విషయాన్ని నిర్మాతలు శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు రాజమౌళి, మహేశ్బాబుతోపాటు మిగతా తారాగణం, మూవీ సిబ్బంది అంతా సోషల్మీడియాలో పోస్టర్ను పంచుకోవటం ద్వారా రిలీజ్ డేట్ను ప్రకటించారు. వారణాసి 2027, ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది.