ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి తరఫున ప్రచారం
ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి
ఖమ్మం మే 7 (విజయక్రాంతి): సినీ నటుడు వెంకటేశ్ మంగళవారం ఖమ్మం నగరంలో సందడి చేశారు. ఖ మ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరఫున ప్రచారం చేశారు. స్థానిక మయూరి సెంటర్ నుంచి పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్, పాత కలెక్టరేట్ మీదుగా ఇల్లెందు క్రాస్రోడ్ వరకు రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు.. ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు.. ఈ రఘురాముడిని ఆదరి ంచండి.. ఓటువేసి అత్యధిక మెజారిటీతో ఖమ్మం ఎంపీగా గెలిపించండి అని కోరారు. రోడ్షోలో మంత్రి పొం గులేటి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి పాల్గొన్నారు.