calender_icon.png 26 October, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు నెలలు దాటిన ప్రతి పశువుకి గాలి కుంటు వ్యాధి టీకాలు ఇప్పించాలి

25-10-2025 07:08:37 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): మూడు నెలలు దాటిన ప్రతి పశువుకి గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించాలని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి, కాళోజి వాడి  గ్రామాలలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు తమ పశువులకు ఖచ్చితంగా గాలికుంటు వ్యాధి టీకాలు ఇప్పించుకోవాలని సూచించారు. గాలికుంటు వ్యాధి సోకితే పశువుల పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 60 ఆవులకు 348 గేదెలకు టీకాలు అందించారు.