14 July, 2026 | 3:51 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

అహింసా మార్గంతోనే విజయం

03-10-2024 01:12 AM
  1. టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి 
  2. డా.ఎస్‌ఎం. హుస్సేని (ముజీబ్)

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని టీఎన్జీవోస్ యూనియన్ కార్యాలయంలో బుధవారం ఘనం గా నిర్వహించారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు టీఎన్జీవోస్ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌ఎం హుస్సేని(ముజీబ్) పూలమాల వేసి నివాళులర్పించారు.

బాపూజీ చూపిన అహింస బాటలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని, జీవితంలో అహింసా మార్గం ఒకటే విజయ కేతనం చూపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విక్రమ్‌కుమార్, సభ్యులు బాలరాజు, కేఆర్ రాజ్‌కుమార్, ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, వైదిక శాస్త్ర, నరేశ్ కుమార్, ఖాళీద్ అహ్మద్, మహమ్మద్ జహంగీర్ అలీ, మహమ్మద్ వహీద్ తదితరులు పాల్గొన్నారు.