14-05-2025 12:00:00 AM
తుర్కయంజాల్, మే 13 : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ ఎన్ ఎస్ఆర్ నగర్ కాలనీలో పునీత ఆంతోనీ మహోత్సవం వైభవంగా సాగింది. గుడిపండగగా పిలిచే ఈ ఉత్సవానికి ఇబ్రహీం ప ట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాస్టర్లు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో టి.పీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండ్లపల్లి ధన్రాజ్గౌడ్, సామ భీంరెడ్డి, రేవల్లె హరితాయాదగిరి, కంబాలపల్లి గురునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.