2 July, 2026 | 2:17 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

పేద విద్యార్థికి గ్రామస్తుల అండ

22-10-2025 12:00 AM

పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ బహుకరణ

పాపన్నపేట, అక్టోబర్ 21 : పాపన్నపేట మండలం దౌలాపూర్ గ్రామస్తులు కలిసి ఓ నిరుపేద విద్యార్థికి సైకిల్ అందజేశారు. గ్రామానికి చెందిన చాకలి చందు అనే 8వ తరగతి విద్యార్థి ప్రతిరోజూ 4 కి.మీ (కుర్తివాడ ఉన్నత పాఠశాల) నడుచుకుంటూ వెళ్లడానికి ఇబ్బంది పడుతూ, తోటి విద్యార్థుల వలె తానూ సైకిల్ కొనాలనుకున్నా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉండడంతో కలత చెందిన విద్యార్థినిని గమనించిన గ్రామస్థులు ఐకమత్యంతో ముందుకొచ్చి డబ్బు సమీకరించారు. ఆ డబ్బుతో సైకిల్ కొనుగోలు చేసి దీపావళి రోజు ఆ విద్యార్థికి అందజేసి ఆ ఇంట్లో దీపావళి వెలుగులు నింపారు.

గంటలో డబ్బులు జమ..

విద్యార్థికి సహాయం కోసం సుమారు 30 మంది ఒకే గంటలో దాదాపు రూ.6 వేలు జమచేసి ఆ వెంటనే సైకిల్ తీసుకువచ్చి అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ఐక్యమత్యంతో ఉంటే కొండంత సమస్య కూడా సులభంగా పరిష్కారం అవుతుందన్నారు.