1 July, 2026 | 6:36 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

సీతంపేటలో బోరు వేసిన మంత్రి శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామ ప్రజలు

31-07-2025 11:58 PM

మంథని,(విజయక్రాంతి): గ్రామస్తులు అడుగగానే మండలంలోని సీతంపేట లో  బోరు వేసిన శ్రీధర్ బాబు కు  గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద బోర్ వేశారు. గత కొన్ని ఏండ్ల నుండి హనుమాన్ టెంపుల్ వద్ద సుమారు 100 మంది హనుమాన్ భక్తులు,  బ్రహ్మం గారి భక్తులు దీక్ష  తీసుకుంటున్నారని, వారికి దేవాలయం వద్ద నీరు లేక స్నానాలకు త్రాగడానికి ఇబ్బంది పడుతున్నారని,  గ్రామస్తులు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్లగా స్పందించి మంత్రి వెంటనే బోర్  వేయించినారని, హనుమాన్ భక్తులు, బ్రహ్మంగారి భక్తులు సీతంపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు కు  సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందంకు, కాంగ్రెస్ మండల పడ్డ అధ్యక్షుడు బాలాజీకి గ్రామ కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.