07-06-2025 12:12:51 AM
మణికొండ జూన్ 6: మణికొండ అల్కాపూరి కాలనీలో కొందరు సీనియర్ సిటిజన్స్ పేరుతో ఓ ప్రముఖ బిల్డర్ ను బెదిరిస్తున్న ఘటన వెలుగుచూసింది. సీనియర్ సిటిజన్స్ కాబట్టి తమను ఎవరూ ఏమీ అనరు అనే ధైర్యంతో బిల్డర్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు వీళ్లు.
ఆ బిల్డర్ దగ్గర ఫ్లాట్ బుక్ చేసుకుని, ఎక్కువ డబ్బులు తిరిగి రాబట్టేందుకు ప్లాన్ చేసిన ఈ సీనియర్ సిటిజన్స్ ఓ గ్రూప్ గా ఏర్పడి బిల్డర్ ను బెదిరిస్తున్నారు. బిల్డర్ కార్యాలయానికి వెళ్లి సెక్యూరిటీతో గొడవపడ్డారు. వాట్సాప్ లోనూ బిల్డర్ ను దూషిస్తూ మెసేజ్ లు పంపుతున్నారు.
సీనియర్ సిటిజన్స్ అనే ముసుగులో ఓ గ్యాంగ్ లా తయారై ప్రొఫెషనల్ గా ఉండే బిల్డర్స్ పై దౌర్జన్యం చేస్తున్నారు. అల్కాపురి కాలనీలో ఇలాంటివి గతంలో ఎప్పుడూ చూడలేదని పలువురు స్థానికులు వాపోతున్నారు. వీరిని చట్టపరంగానే ఎదుర్కోవాలని బిల్డర్ భావిస్తున్నారు. దౌర్జన్యం చేస్తున్న ఈ సీనియర్ సిటిజన్స్ గ్యాంగ్ పై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.