calender_icon.png 31 December, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమాలకు సిద్ధం కావాలి

31-12-2025 04:38:29 PM

మోడీ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి

లేబర్ కోడ్స్, విబిజి రాంజీ, విద్యుత్ సవరణ చట్టాలు రద్దయ్యే వరకు పోరాట ఆగవు

 బండ శ్రీశైలం రైతు సంఘం రాష్ట్ర నాయకులు

చండూరు,(విజయక్రాంతి): నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం రైతాంగం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ లు పిలుపునిచ్చారు. బుధవారం సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం రౌండ్ టేబుల్ సమావేశం చండూరు మార్కెట్ యార్డులో ఏర్పుల యాదయ్య అధ్యక్షతన నిర్వహించారు.

రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావ్యతిరేక చట్టాలను తెచ్చి దేశ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్ని రద్దుచేసి నాలుగు లేబర్ కోట్స్ తెచ్చి కార్మిక వర్గాన్ని మరింత దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చిందని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగా వామపక్షాల మద్దతు 2005 లో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో పేదలు పొట్టలు కొట్టే విధంగా విబిజి రాంజీ చట్టం తేవడం దుర్మార్గమైన చర్యాని అన్నారు.

రైతాంగానికి అండగా ఉంటామని చెప్పిన మోడీ సర్కార్ కనీస మద్దతు ధనల చట్టం చేయకపోగా విద్యుత్ సవరణ బిల్లు పేరుతో విద్యుత్తు రంగాన్ని ప్రైవేటుపరం చేసి ప్రజల భారం పడేవిధంగా కొత్త చట్టం తెచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ సహజ వనరులను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం బిజెపి నిదానంగా మారిందని ఈ విధానాలపైన పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.

రైతు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల దేశవ్యాప్త ప్రచార క్యాంప్యంలో భాగంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు కరపత్ర ప్రచారం ప్రచార జీపి జాతల ద్వారా ఐతే ప్రజల్ని చైతన్యం చేస్తామని తెలిపారు. జనవరి 19న కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇప్పుడు తెచ్చిన చట్టాల పైన దేశవ్యాప్తంగా నిర్వహించే ర్యాలీలు సభలు లో భాగంగా నల్లగొండలో నిర్వహించే సభకు కార్మికులు రైతాంగం ప్రజలు పెద్ద ఎత్తున హాజరై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాలని పిలుపునిచ్చారు.