17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రతి ధాన్యం గింజను కొంటాం

07-05-2025 12:00 AM

నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, మే 6 (విజయక్రాంతి) : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రబీ ధాన్యం కొనుగోళ్లలో భాగంగా ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజామాబాద్ తర్వాత అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలలో నల్లగొండ రెండవదని తెలిపారు.

వర్షం వచ్చినప్పటికి రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలును పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నల్లగొండ జిల్లా, గుర్రంపోడు మండలం కొప్పోలు, గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఇక్కడ లారీల సమస్య ఉత్పన్నమైందని తెలుసుకొని తక్షణమే ఈ రెండు కేంద్రాలకు వెళ్లి సమస్యపె అక్కడి రైతులు, స్థానికులతో మాట్లాడారు. లారీల సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పంపించే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒకే మిల్లుకు నాలుగైదు లారీలు పంపించకుండా ఆ పరిధిలో ఉన్న అన్ని మిల్లులకు ఒక్కో లారీ పంపించాలని, అప్పుడే ధాన్యాన్ని వెంటవెంటనే దించుకోవడం కొనుగోలు కేంద్రాలనుంచి పంపించడం సులభం అవుతుందని, లేదంటే ఒకే మిల్లుకు పంపించిన ట్లయితే దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.

ఒకవేళ కేటాయించిన లారీలు సరిపోకపోతే అదనంగా స్థానికంగా లారీలను ఏర్పాటు చేయాలని తహసీల్దార్ శ్రీనివాసుకు కలెక్టర్ ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, రెవెన్యూ అదనపు ఇన్చార్జి కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, గుర్రంపొడ్  తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాగా, కొప్పోలు, గుర్రంపోడు  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా నిర్వహిస్తుండగా, ఈ రెండు కేంద్రాలలో రికార్డుల నిర్వహణ ,తేమ అన్ని సక్రమంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.