24-08-2025 09:56:04 AM
హైదరాబాద్: సైబర్ మోసగాళ్ళు(Cyber fraudsters) ట్రాఫిక్ చలాన్ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసి రూ.1.36 లక్షలు కాజేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా(Guntur District) దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, స్థానికంగా హోటల్ నడుపుతున్న నిరంజన్ రెడ్డికి శుక్రవారం రాత్రి తన మొబైల్ ఫోన్లోని APK ఫైల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తన వాహనంపై చలాన్ ఉందని, దానిని వెంటనే చెల్లించాలని సందేశం వచ్చింది. పూర్తి సమాచారం కోసం, అందులో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయమని అడిగారు. ఆ లింక్ పై క్లిక్ చేసినప్పుడు, ఒక యాప్ డౌన్లోడ్ చేయబడింది. అతను దానిని తెరిచినప్పుడు, అది ఓటిపిని కోరింది.
నిరంజన్ రెడ్డికి అనుమానం వచ్చి ఆ ప్రక్రియను మధ్యలో ఆపేశాడు. కానీ, శనివారం ఉదయం అతని క్రెడిట్ కార్డు నుండి ఒకసారి రూ.61,000, మళ్ళీ రూ.32,000 విత్డ్రా చేసినట్లు సందేశాలు వచ్చాయి. అతను ఆందోళన చెంది కార్డును బ్లాక్ చేశాడు. కానీ ప్రక్రియ పూర్తి కాకముందే, మరో సందేశం వచ్చింది, రూ. 20,999 రూపాయలు విత్డ్రా చేసుకున్నారు. ఈ విధంగా, రూ. 1.36 లక్షలు చాలాసార్లు విత్డ్రా అయ్యాయి. ఆ డబ్బుతో ఆన్లైన్లో మొబైల్స్ కొనుగోలు చేసినట్లు నిరంజన్ రెడ్డికి సందేశాలు వచ్చాయి. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు, మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.