20 June, 2026 | 7:00 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి

16-10-2025 06:33 PM

ములకలపల్లి (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ కోరారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'చైతన్యం' డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. డ్రగ్స్ వాడకం వల్ల ఆర్థికంగా శారీరకంగా మానసికంగా నష్టపోతారని వీటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడిన, సరఫరా చేసిన కేసులపాలై జైలు జీవితాలను గడపడంతో పాటు భవిష్యత్తు అందాకారంగా మారుతుందన్నారు. విలువైన జీవితాలు నాశనం అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థినీ విద్యార్థుల చేత డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎస్.కె.అతేహార్ అలీ, అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.