కంటి చూపును పరిరక్షించుకోవాలి
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జూన్ 21 (విజయక్రాంతి): వయసు పెరుగుతున్న కొద్ది చూపు మందగిస్తుంటుందనీ.. ప్రతిఒక్కరూ కంటి చూపును పరిరక్షించుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ వెంచర్-3 హిమకీర్తి అపార్ట్మెంటులో కళ్లెం శ్రీనివాస్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
అందులో కంటి పరీక్షలు చేయించుకున్న పలువురికి కళ్ళద్దాల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే లబ్ధిదారులకు కళ్ళజోళ్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంటి పరిరక్షణ కోసం సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు. కంటికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నివాసితులు తదితరులు పాల్గొన్నారు.






