17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మా భూమి మాకు కావాలి!

13-05-2025 12:11 AM
  1. ప్రజావాణికి పాదయాత్రగా యువ రైతు దంపతులు

ప్రజావాణిలో అధికారుల తీరు పట్ల అసంతృప్తి

నాగర్ కర్నూల్ మే 12 (విజయక్రాంతి) తమ భూమి కబ్జాకు గురైందని ఎన్నో మార్లు మండల డివిజన్ జిల్లా స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ తమ గోడు వినట్లేదని నిరసిస్తూ సోమవారం యువ రైతు దంపతులు ప్రజావాణి వద్దకు పాదయాత్రగా వచ్చారు.  నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన రాత్లావత్ రవి గీత దంపతులు తమ మూడెకరాల భూమిలో ఎకరం భూమి ఇతరులు కబ్జా చేశారని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ శివారులోని 243 సర్వే నెంబర్లో మొత్తం 11 ఎకరాల భూమికి గాను గతంలో ఆరు ఎకరాలు, మరో 2ఎకరాలు గత 20ఏళ్ల క్రితం వారి పెద్దలు అమ్ముకున్నారు. మిగిలిన 3ఎకరాలు వరసత్వంగా వచ్చినట్లు తెలిపారు. కాగా మరో ఎకరం పొలాన్ని ఇతరులు కబ్జా చేశారని మండల తహసీల్దార్, డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులకు కూడా మోర పెట్టుకున్నామని సర్వే చేయించి హద్దు రాళ్లను పాతినా భూ కబ్జా దారులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజావాణిలోని అధికారులు కూడా అలసత్వంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 కిలోమీటర్లు కాలినడకన నడిచిన నొప్పి కలగలేదని ప్రజావాణిలో అధికారులు మాట్లాడిన మాటకి గుండెలో బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమలాంటి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.