17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

01-05-2025 12:25 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మీ

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం కృషి చేయాలని ఎమ్మె ల్యే కోవ లక్ష్మీ అన్నారు. బుధవారం మండలంలోని గుండి గ్రామంలో ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మాజీ జెడ్పీటీసీ అరిగేల నాగేశ్వర్ రావులతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రత్నా అంబేద్కర్ చూపిన అడుగుజాడలలో నడవాలని యువకులు మహనీయులను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంత రం భీం సైనిక్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో  సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్ అలి బిన్ అహ్మద్, మాజీ సర్పంచ్ జబరి అరుణ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు జాబరి రవీందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.