05-04-2025 05:29:33 PM
బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన రాజ్ కుమార్ రెడ్డి..
నారాయణపేట (విజయక్రాంతి): భారత మాజీ ఉప ప్రధానమంత్రి దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహనీయులు చూపిన మార్గంలో యువత పయనించి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. నివాళులు అర్పించిన వారిలో ఆదిరాల రమేష్, మహేష్ యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.