1 July, 2026 | 10:01 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

01-08-2025 12:03 AM
  1. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పును తాము స్వాగతిస్తున్నామని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పే ర్కొన్నారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కోర్టు తీర్పుపై ఆయన స్పందిం చారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం మంచి ప రిణామమన్నారు.

కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా తె లంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కో రారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ గతంలో బీఆర్‌ఎస్ మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్ర భుత్వం ఎమ్మెల్యేలను లాక్కొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందన్నారు. తెలంగా ణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “జనహిత పాదయాత్ర” వాస్తవంగా జనహితమా లేదా ప్రజలను మోసం చేయడమా అనేది కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్  చేశారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్.. విద్యార్థులు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, మహిళలు వంటి వర్గాలకు డిక్లరేషన్ల పేరుతో అనే క హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు, మేనిఫెస్టోలో పేర్కొ న్న అంశాలు, డిక్లరేషన్ల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.