24-06-2025 01:46:04 AM
- ఎంపీ రఘునందన్రావుకు మావోయిస్టుల బెదిరింపులు
- పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ కాల్
- డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎంపీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): మెదక్ ఎంపీ రఘునందన్ రా వును చంపుతామంటూ సోమవారం పీపు ల్స్ వార్ మావోయిస్టుల పేరిట బెదిరింపు కాల్ వచ్చింది. ఓ ఆగంతకుడు ఎంపీకి ఫోన్ చేసి సోమవారం సాయంత్రంలోగా చంపే స్తాం అంటూ బెదిరించాడు. దీంతో ఎంపీ రఘునందన్రావు వెంటనే డీజీపీతో పాటు సంగారెడ్డి ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఎంపీ రఘునందన్రావు మేడ్చల్ జిల్లాలోని దమ్మాయి గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పా ల్గొన్నారు.
ఆ సమయంలో రఘు నందన్రా వుకు ఫోన్ రాగా.. అతడి పీఏ ఎ త్తాడు. ఫోన్ చేసిన ఆగంతకుడు తాను మధ్యప్రదేశ్కి చెం దిన మావోయిస్టునని పరిచయం చేసుకున్నాడు. సోమవారం సాయంత్రంలోగా చం పేస్తామని, దమ్ముంటే కాపాడుకోండి అం టూ బెదిరించాడు. ఈ బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్రావు వెం టనే డీజీపీ జితేందర్కు, సంగారెడ్డి ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తును ము మ్మరం చేశా రు. కాల్ వచ్చి న నంబర్ ఆ ధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
బెదిరింపులకు భయపడను: ఎంపీ రఘునందన్రావు
చంపేస్తాం అంటూ వచ్చిన బెదిరింపులకు తాను భయపడబోనని, బీజేపీ నాయ కులు, కార్యకర్తలు ఎవరూ కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్కు భయపడబోరని ఎంపీ రఘునందన్రావు స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. “ఇప్పుడే మధ్యప్రదేశ్ నుంచి మావోయిస్టు పార్టీ దళం బయలుదేరింది. ఇవాళ అర్ధరాత్రి(సోమవారం)లోపు చంపేస్తాం” అని ఆగంతకుడు హెచ్చరించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ కగార్ను ఆపేందుకు మావోయిస్టులు ఏదైనా ప్రయత్నిస్తున్నారేమో అన్నారు.