22 June, 2026 | 7:55 PM

Breaking News

ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •  

ఆపదలో ఉన్న పేద విద్యార్థులకు అండగా ఉంటాం

22-01-2026 05:38 PM

- విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బోల్గురి ముకేష్

మునుగోడు,జనవరి 22 (విజయక్రాంతి): అనారోగ్యం, ఆపదలో ఉన్న పేద విద్యార్థులకు అండగా ఉండటమే విద్య నిర్వీజ్ఞ ఫౌండేషన్ లక్ష్యమని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బోల్గురి ముకేష్ అన్నారు. గురువారం మండలంలోని రత్తిపల్లి గ్రామంలో అనారోగ్యంతో ఉన్న విద్యార్థి కుటుంబానికి ‘విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అండగా నిలిచి భరోసా కల్పించింది. ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రడం మని కుమార్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వారికి నిత్యావసర సరుకులను ఫౌండేషన్ ప్రతినిధులు అందజేసి మాట్లాడారు.చదువుకునే పిల్లలు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సాయం అందించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రాకేష్, జగదీశ్, గాదె రాజు, బొడ్డుపల్లి రాజు, బోల్గురి ఉపేదర్, మహేందర్ ,గాదె శివరాజ్ ఉన్నారు.