17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

01-05-2025 12:51 AM

ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 30: బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. బుధవారం  తహసీల్దార్ సుదర్శన్ రెడ్డితో కలసి రావి నారాయణరెడ్డి కాలనీ ఫేస్ 3 లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో తాము సర్వం కోల్పోయామని.. తమ సర్టిఫికెట్స్ కూడా కా లి బూడిద అయినట్లు బాధితులు ఆర్డీవో దృష్టికి తీసుకెళారు.

అనంతరం ఆర్డీవో అనంతరెడ్డి మాట్లాడుతూ... బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో 200 గుడిసెలు కాలిపోయాయని.. ప్రమాద వివరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని బాధితులకు తగు న్యాయం చేస్తామని ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర చారి, నాయకులు ముత్యాల యాదిరెడ్డి, అజ్మీర హరి సింగ్ నాయక్, దాసరి ప్రసాద్, పొన్నాల యాదగిరి, గణేష్, సైదులు, నవనీత, అరుణ, సుజాత, వినోద్ నాయక్, వీరేష్, తదితరులు పాల్గొన్నారు.