17-05-2025 12:30:52 AM
- మాజీ కౌన్సిలర్ అనుపమ లక్ష్మారెడ్డి
- ఎంపికైన లబ్ధిదారులకు కమిషనర్ రవీందర్ రెడ్డితో కలిసి మంజూరు పత్రాలు అందజేత
అబ్దుల్లాపూర్ మెట్, మే 16: కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని పెద్ద అంబర్ పేట్ మాజీ కౌన్సిలర్ అనుపమ లక్ష్మారెడ్డి అన్నారు. ఇం దిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు కమిషనర్ రవీందర్ రెడ్డి తో కలిసి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షే మ పథకాలు అందజేస్తామన్నారు. 4వ వార్డులో స్థలాలు ఉన్న 16 మందికి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మానానికి నిధులు మంజూరయినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి ల కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్నారు.